RakulPreetSingh : సోషల్ మీడియా నెగిటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం

Rakul Preet Singh Slams Social Media Trolls: 'Idle People Have Increased

RakulPreetSingh : సోషల్ మీడియా నెగిటివిటీపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం:నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో “పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారని” విమర్శిస్తూ, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి వేరే పనేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆమె తన పోస్ట్‌లో, “పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివిటీని వ్యాపింపజేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు: పనికిమాలిన వాళ్ళపై ఫైర్!

నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో “పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారని” విమర్శిస్తూ, ఇతరులను బాధపెట్టడం తప్ప వారికి వేరే పనేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆమె తన పోస్ట్‌లో, “పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివిటీని వ్యాపింపజేస్తున్నారు.

ఇతరులపై కామెంట్లు పెడుతూ సంతోషిస్తున్నారు. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని వ్యక్తిగతంగా బాధపెట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు” అని పేర్కొన్నారు.

రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు రకుల్‌కు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు.టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత ఆమె సినిమాలను తగ్గించారు. ఇటీవల రకుల్ నటించిన ‘మేరే హస్బెండ్ కి బివి’ చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో రకుల్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

Read also:Health News : మహిళ కాలేయంలో 3 నెలల పిండం: వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అరుదైన కేసు!

Related posts

Leave a Comment